మణికొండలో అక్రమ దుకాణాల కూల్చివేత

రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో మంజీర వాటర్ పైప్ లైన్ పైన కబ్జా చేసి అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు వాటర్ బోర్డు అధికారులతో కలిసి పోలీసుల సహాయంతో తొలగించారు. రహదారి పక్కనే ఫుట్ పాత్ ల పై అక్రమంగా దుకాణాలను మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. గత కొన్ని ఏళ్లుగా రహదారి పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న వారు, వేసుకున్న డబ్బాలు తాత్కాలిక షెడ్లను, జెసిబి సాయంతో తొలగించారు. ఫుట్ పాత్ ల ను కబ్జాలు చేస్తే ఊరుకునేది లేదని టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ హెచ్చరించారు.