షాకింగ్ : జగన్ కూడా జంప్ ..?

ys jagan reddy

ఇప్పటికే వైసీపీకి చెందిన 20 నేతలు టీడీపీ గూటికి చేరారు. మరికొంఈదరు సైకిల్ ఎక్కేందుకు స్కెచ్ వేసుకొంటున్నారనే వార్తలొస్తున్నాయి. తాజాగా, మరో షాకింగ్ న్యూస్ కూడా వచ్చేసింది. త్వరలోనే వైఎస్ జగన్ కూడా జంప్ కానున్నాడట. అదేంటీ ? పార్టీ అధినేతనే జంప్ చేస్తే ఇక, వైసీపీ ఉనికెక్కడ? జగన్ జంప్ చేసేది నిజమే కానీ.. అది టీడీపీలోకి కాదు. హైదరాబాద్ నుంచి విజయవాడకి.

ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తికానని విజయవాడకి మార్చాడు. ఇప్పుడు జగన్ కూడా అక్కడికి జంప్ కావడానికి రెడీ అవుతున్నట్టుసమాచారమ్. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్ లో మాదిరిగా ఇళ్లు, పార్టీ కార్యాలయం హైఫైగా ఉండే రీతిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వర్కవుట్ కాగానే జగన్ అక్కడికి జంప్ కానున్నాడు. అన్నట్టు.. చిరునామా మాత్రం రెండింటిని మెయిన్ టైన్ చేస్తాడట. హైదరాబాద్ మరియు విజయవాడ రెండూ చోట్ల తన చిరునామా ఉండాల్సిందేనని ఇప్పటి నుంచే పట్టుపడుతున్నాడు జగన్. మొత్తానికి జగన్ కూడా జంప్ అన్నమాట.