జగన్ సమైక్య పర్యటనలు..!

jaganసమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్రితం చేయాలని వైకాపా జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కోర్టు ఆంక్షలు కూడా తొలగడంతో.. జగన్ జిల్లాల పర్యటనలపై దృష్టిసారిస్తున్నారు. సొంత జిల్లా నుంచి పర్యటనలు ప్రారంభించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కేంద్రం ఏర్పాటు చేయబోయే అఖిలపక్ష సమావేశాన్ని సైతం బహిష్కరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ.. సమైక్య వాదాన్ని వినిపిస్తున్న తమకు ఇంకా వివరణలు ఇవ్వాల్సిన పనిలేదని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మొత్తమ్మీద.. సమైక్య వాణితో.. సీమాంధ్రలో స్ట్రాంగ్ గా సెటిల్ అవ్వాలని వైకాపా ప్లాన్ గా కనిపిస్తోంది. మరీ.. జగన్ సమైక్య వాణి ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి..