ఎండిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత వెబ్‌ ఆప్షన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎండిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24, 25 తేదీల్లో తుది విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ కోరింది.

మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయి జాయిన్‌ కానీ అభ్యర్థులు, ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని యూనివర్సిటీ ప్రకటించింది. అలాగే ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తానమని పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను విడుదల చేశారు. మరింత సమాచారాన్ని యూనివర్సిటీ వెబ్ సైట్ www://knruhs.telangana.gov.in చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.