తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక ఎఫెక్ట్

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికలపై పడనున్నాయని చెబుతున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తెలంగాణలోనూ కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. ఆయన జోస్యం నిజమవుతుందా.. ? లేదా.. ?? అన్నది నెలరోజుల్లో తేలనుంది.

ఇక, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి అనివార్యమైంది చెప్పుకొచ్చారు జేసీ. కర్ణాటక ఉప ఎన్నికల్లో భాగంగా.. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది.