తెలంగాణ ఉద్యోగులకు కెసిఆర్ ఆఫర్

KCRతెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను ముందుగానే ఇవ్వడానికి నిశ్చయించింది. ఈ నేపధ్యంగా సెప్టెంబర్ నెల వేతనాలను అక్టోబర్ 2వ తేదీన బతుకమ్మ, 3వ తేదీన దసరా పండుగలను పురస్కరించుకుని ముందుగానే చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇక ఇందుకు అనుగుణంగా సెప్టెంబర్ 28కల్లా వేతనాలను అందచేసేలా ఆర్ధిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే 28వ తేదీ ఆదివారం కావడంతో వేతనాల మంజూరి మరో రోజు ముందుకు వచ్చి 27వ తేదీకే అందుతాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ పండుగల సందర్భంగా ముందుగా జీతాలు ఇవ్వడం తెలంగాణ ఉద్యోగులకు శుభవార్తే మరి.