టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, ఏక‌గ్రీ‌వంగా తొమ్మి‌దో‌సారి !

టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. హైటెక్స్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.