‘ఎపీకి న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్ఎస్’

ktr (8)

టైటిల్ లో తప్పులేదు. మీరు సరిగ్గానే చదివారు. ‘ఎపీకి న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్ఎస్’. ఈ మాట చెబుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి న్యాయం చేయగల ఏకైకపార్టీ టీఆర్ఎస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ .

ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో మాట్లాడిన కేటీఆర్.. ఏపీకి టీఆర్ఎస్ న్యాయం చేయగలదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడని టీఆర్ఎస్ పార్టీ కారణంగా ఏపీకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని, విద్యాసంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ప్యాకేజీలు, హోదాలు ఇలా ఎన్నో ప్రయోజనాలను ఏపీ సొంతం చేసుకుందంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చారు కేటీఆర్.

మరి కేటీఆర్ వ్యాఖ్యాలపై ఏపీ నాయకులు ఎలా స్పందిస్తారో..