తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది..డిజిటల్ లిటరసీ గ్లోబల్ ఛాంపియన్ అవార్డుకు కేటీఆర్ ఎంపికయ్యారు. ఈ అవార్డును సెర్టిపోర్ట్ సంస్థ ప్రకటించింది. ఎక్కువ మంది విద్యార్థులను ఉపాధికి అనుగుణంగా తీర్చిదిద్దినందుకు కేటీఆర్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సెర్టిపోర్ట్ సంస్థ తెలిపింది. ఇక ఈ అవార్డు రావడం పట్ల తెరాస శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..