సీఎన్బీసీ నిర్వహించిన ఇండియా బిజినెస్ లీడర్ అవార్డు కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డును కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా అందుకున్నారు కేటీఆర్.
వివిధ రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల పరిస్థితులు, అందుకోసం రాష్ట్రాలు అవలంభిస్తోన్న విధానాలను పరిగణలోకి తీసుకుని ప్రతీ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది సీఎన్బీసీ. ఇదే క్రమంలో ఈ ఏడాది గాను ప్రకటించిన ‘ఇండియా బిజినెస్ లీడర్స్’ అవార్డుల్లో భాగంగా తెలంగాణ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా ఎంపికయింది. ఈ సంస్థ నుంచి ఇదే విభాగంలో తెలంగాణ రాష్ట్రం రెండోసారి అవార్డును అందుకుంది. గత ఏడాది కూడా ఈ అవార్డ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది.
అవార్డును స్వీకరించాల్సిందిగా సీఎన్ బీసీ కోరగా ప్రభుత్వం తరపున అవార్డు అందుకున్నారు కేటీఆర్. న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్ లో ఈ అవార్డ్ వేడుక కార్యక్రమం జరిగింది.