BJP First List : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..


దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈరోజు బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 195 మందితో తొలి జాబితా విడుదల చేశారు. తొలి జాబితాలో 28 మంది మహిళలు, యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్‌ తావ్‌డే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు బరిలో ఉండగా.. 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు.

రాష్ట్రాల వారీగా చూసినట్లయితే, అండమాన్‌ నికోబార్‌ -1, అరుణాచల్‌ ప్రదేశ్‌ -2, అస్సాం -11, ఛత్తీస్‌గడ్‌ -11, దమన్‌ అండ్‌ దీవ్‌ -1, దిల్లీ -5, గోవా -1, గుజరాత్‌ -15, జమ్మూకశ్మీర్‌ -2, ఝార్ఖండ్‌ -11, కేరళ -12, మధ్యప్రదేశ్‌ -24, రాజస్థాన్‌ -15, తెలంగాణ -9, త్రిపుర -1, ఉత్తరాఖండ్‌ -3, ఉత్తరప్రదేశ్ -51, పశ్చిమబెంగాల్‌ -20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసారు.