భ‌ద్రాచ‌ల సీతారామ‌చంద్ర‌స్వామిని ద‌ర్శించుకున్న‌ నారా లోకేష్‌

పోల‌వరం నిర్వాసిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు వెళ్తోన్న టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మంగ‌ళ‌వారం భ‌ద్రాచ‌లంలో శ్రీ సీతారామ‌చంద్ర‌మూర్తిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ప‌ర్య‌ట‌న‌కి బ‌య‌లుదేరే స‌మ‌యంలో ప‌ల‌క‌రించిన మీడియా ప్ర‌తినిధులతో మాట్లాడారు. రాజ‌కీయాల గురించి ప్ర‌శ్న‌లు అడిగితే..దైవ‌ద‌ర్శ‌నం చేసుకుని వ‌చ్చాను..రాజ‌కీయాలు మాట్లాడ‌ను అంటూ సున్నితంగా తిర‌స్క‌రించారు. స్వామికి ఏమ‌ని మొక్కుకున్నార‌ని అడ‌గ్గా… క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో..క‌రోనా క‌ష్టాలు క‌డ‌తేరాల‌ని, ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాల‌తో వుండాల‌ని, తెలుగురాష్ట్రాలు స‌ఖ్య‌త‌తో ఉండి ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు గౌర‌వించుకుని, ప్ర‌గ‌తిప‌థంలో సాగాలి అని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని సీతారామ‌చంద్ర‌మూర్తికి మొక్కుకున్నాన‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య భ‌ద్రాచ‌లం కేంద్రంగా స‌మ‌స్య‌గా వున్న 5 పంచాయ‌తీల గురించి మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. ఇరురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మంచి స్నేహితులు అనీ, వారు అనుకుంటే క్ష‌ణాల్లో ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స‌మాధానం ఇచ్చారు.