నిజమైన రంగులు ఎప్పటికి వెలసిపోవు, కవితకు మద్దతుగా …


ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఈ రోజు హైదరాబాద్, ఢిల్లీ వ్యాప్తంగా ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజకీయాలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కొన్న కొందరు నేతలు.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీల్లో ఉంది.

ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్యనేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‎కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలను పోస్టర్లలో వేశారు. కానీ, ఎమ్మెల్సీ కవిత మాత్రం రెయిడ్స్‎కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా పోస్టర్లలో పేర్కొన్నారు. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ ఆసక్తికరంగా మారాయి. చివర్లో బై బై మోడీ అంటూ హాష్ టాగ్‎తో పోస్టర్లు వేశారు.