156 గ్రాముల ప్రధాని మోడీ బంగారు ప్రతిమ


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ టీమ్ మోదీ బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం, దీనివెనుక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన కృషిని పురస్కరించుకుని 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని తయారు చేసిన‌ట్టు తెలిపారు. ఈ విగ్రహాన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశామ‌న్నారు. ఈ బంగారు విగ్రహాన్ని రూపొందించేందుకు 11 లక్షల రూపాయ‌లు ఖర్చు అయ్యాయని, దీనిని తయారు చేసేందుకు దాదాపు త‌మ బృందంలోని 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని సందీప్‌జైన్ పేర్కొన్నారు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మ‌రుక్ష‌ణం మోదీ ప్ర‌తిమ‌ను త‌యారు చేసే పని ప్రారంభించిన‌ట్టు సందీప్ జైన్​ చెప్పారు. త్వ‌ర‌లోనే ప్ర‌ధానిని క‌లిసి దీనిని ఆయ‌న‌కు బ‌హూక‌రించ‌నున్న‌ట్టు వివ‌రించారు.