టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. మోత్కుపల్లి నాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది. ప్ర‌జా జీవితంలో మోత్కుపల్లి న‌ర్సింహులుకి ఒక స్థానం ఉంది. విద్యార్థి ద‌శ త‌ర్వాత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మోత్కుపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే కాకుండా అణ‌గారిన ప్ర‌జల గొంతుగా నిలిచి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అన్నారు.