పవన్ కళ్యాణ్ మాటల పై కవిత ఖుషి

kavitha
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గళమెత్తిన పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కవిత… పవన్ కల్యాణ్ కామెంట్లను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఈ దిశగా దృష్టి సారించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

నిన్న సభలో పవన్ కళ్యాణ్ ఎపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే , రక్షించండని మనం బిజెపి దగ్గరకు వెళితే వీరు పొట్టలో పొడిచారని, బిజెపి ప్రత్యేక హోదా ఇస్తుందని అనుకుంటే పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చిందని, ఇవి ఎవరికి కావాలి? ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు పవన్.