ముద్రగడే ప్రధాన దోషి : సీఐడీ

mudragada
తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన హింసకాండకు ప్రాధన బాధ్యుడు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభమే అని తేల్చింది సిఐడి. ఈ ఘటన పై విచార‌ణ జ‌రిపిన సీఐడీ ఈరోజు తుని కేసు రిమాండ్ రిపోర్టును మీడియా ముందుంచింది. తుని కుట్రకు పూర్తి బాధ్యత ముద్రగడదే అని పేర్కొంది. కాపులు నిర్వ‌హించిన స‌భ‌లో ఆ వర్గం కార్యకర్తలు రెచ్చిపోవ‌డంతో ర‌త్నాచ‌ల్ రైలు, ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం జ‌రిగాయని, ఈ విధ్వంసానికి కార్య‌క‌ర్త‌ల్ని ముద్ర‌గ‌డే ప్రేరేపించారని, ముద్రగడ వ్యాఖ్యలతో ఆందోళ‌నకారులు రెచ్చిపోయారని , కొంద‌రు ఆందోళ‌నకారులు కుట్ర పూరితంగా స‌భ‌కు వ‌చ్చారని.. త‌మ‌తో ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే తెచ్చుకున్నారని నివేదిక‌లో పేర్కొంది సీఐడీ.