‘పురుగుల మందు’తో బెదిరిస్తున్న ముద్రగడ

mudragda
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షలో హైడ్రామా నెలకొంది. తుని ఘటనకు సంబందించిన కేసులు ఎత్తివేయాలంటూ ఆయన తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చారు. అయితే బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే పురుగుల మందు తాగుతానని పురుగుల మందు డబ్బా చూపించి బెదిరించారు ముద్రగడ. దీంతో ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.