ఆవేశం వద్దు: లోకేష్

lokesh
వైసీపీ రాష్ట్ర వ్యతిరేకి అని విమర్శించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌ వేదికగా ఆయన జగన్ పై పలు విమర్శలు గుప్పించారు. వైసీపీ రాష్ట్ర వ్యతిరేకి అని చెప్పేందుకు అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటనే ఉదాహరణ అని, టీడీపీ శ్రేణులను జగన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని, తమ శక్తియుక్తులన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిద్దామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు లోకేష్.