నిస్సాన్ కార్ల స్టీరింగ్‌లో సమస్య.. 2.36 లక్షల కార్లను రీకాల్ చేసిన కంపెనీ


ప్రముఖ ఆటో దిగ్గజం నిస్సాన్ మార్కెట్లోని దాదాపు 2లక్షల 36 వేల కార్లను రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మోడల్ కార్లలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడం ద్వారా కస్టమర్లకు సేఫ్టీ ఇవ్వడమే తమ తొలి ప్రాధాన్యత అని నిస్సాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ సస్పెన్షన్‌లోని టై రాడ్‌లతో సమస్య కారణంగా నిస్సాన్ అమెరికాలో రీకాల్ జారీ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ దాని రీకాల్ డాక్యుమెంట్‌లో టై రాడ్‌లు వంగి, విరిగిపోవడానికి దారితీయవచ్చని పేర్కొంది. స్టీరింగ్ నియంత్రణ కోల్పోయే సమస్యను పరిష్కరించడానికి నిస్సాన్ 236,000 కంటే ఎక్కువ కార్లను రీకాల్ చేసింది నిస్సాన్. తాజా రీకాల్ 2020, 2022 మధ్య ఉత్పత్తి చేయబడిన నిస్సాన్ సెంట్రా కాంపాక్ట్ కార్లపై ప్రభావం చూపుతుందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెల్లడించింది. ఈ వాహనాల టై రాడ్‌లు వంగినప్పుడు, అవి విరిగిపోయే అవకాశం ఉందని నిస్సాన్ గుర్తించినట్లు పేర్కొంది. ఇది వాహనం స్టీరింగ్ సిస్టమ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వాహన యజమానులు తమ స్టీరింగ్ వీల్ మధ్యలోకి వెళ్లడం లేదా వైబ్రేషన్‌లను అనుభవిస్తే, స్థానిక డీలర్‌లను సంప్రదించాలని వారికి సూచించారు. నిస్సాన్ డీలర్లు వంగి లేదా విరిగిన టై రాడ్‌లను తనిఖీ చేసి భర్తీ చేస్తారు.