ఎన్నికల ప్రచారంలో కరోనా పంజా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్ కి కరోనా పాజిటివ్

నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక ప్రచారం లో కరోనా విజృంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాక పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది. ఇది తెలుసుకున్న కార్యకర్తలు కరోనా టెస్ట్ లు చేసుకొనే పనిలో పడ్డారు, ఇంకా ఎంతమందికి వస్తుందో మరో రెండు మూడు రోజులలో తెలుస్తుంది.