షాక్ : ఆయిల్ ట్యాంకర్ యజమానుల మెరుపు సమ్మె

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషపూర్ హెచ్.పీ.సీ.ఎల్ డిపో వద్ద ఆయిల్ ట్యాంకర్ యజమానుల మెరుపు సమ్మె చెప్పట్టరు హెచ్.పీ.సీ.ఎల్ లో కొత్త రూల్స్ తో సతమతమౌతున్నమని ఆయిల్ ట్యాంకర్ యాజమానుల ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం టాప్ లోడ్ ఫిల్లింగ్ సిస్టమ్ ఉన్న ట్యాంకర్లను,బాటమ్ లోడ్ ఫిలింగ్ సిస్టం లోకి మార్చుకోవాలని రూల్స్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని వారు అన్నారు బాటమ్ లోడ్ ఫిలింగ్ సిస్టమ్ ద్వారా ఒక్కో టాంకర్ కి పది నుండి పదిహేను లక్షల ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున ఇబ్బందులకు గురవుతున్నామని,సమస్యలు పరిష్కరించాలని గత కొంతకాలంగా ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపిన ఫలితం లేకపోవడంతో పెట్రోల్,డీజిల్ రవాణా నిలిపి వేస్తున్నామంటూ ప్రకటిస్తూ ఈ రోజు వారు హెచ్.పీ.సీ.ఎల్ డిపో గేటు ముందు ఆందోళనకు దిగారు ఇప్పటికైనా హెచ్.పీ.సీ.ఎల్ అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు .