17 కి.మీ దూరం కేవలం 15 నిమిషాల్లోనే… గుండె, ఊపిరితిత్తుల తరలింపు !

హైదరాబాద్ లో ఈ ఉదయం బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్‌కు గ్రీన్‌ఛానల్‌ ద్వారా తరలించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్‌కు తరలించారు. గ్రీన్‌ ఛానల్‌ సాయంతో అంబులెన్స్‌ దాదాపు 17 కి.మీ దూరాన్ని కేవలం 15 నిమిషాల్లోనే బేగంపేట కిమ్స్‌కు చేరుకుంది.