నడిరోడ్డుపై కత్తులతో వ్యక్తి దారుణ హత్య


పహాడీషెరీఫ్ పోలిస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. స్థానికులు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పహాడిశెరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి షాహిన్ నగర్ ఓమర్ కాలనికి చెందిన ఉస్మాన్ అనే వ్యక్థిని అదే ప్రాంతంలో నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హత్యచేశారు. అయితే అరుపులు కేకలు వెయ్యడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. దీంతో స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపి నిందితులను గుర్తించేందుకు అదారాలను సేకరిస్తున్నారు.