పవన్ పొలిటికల్ పర్యటన షురు.. !!

pawan
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ పర్యటన షురు అయినట్లు కనిపిస్తోంది. తాజాగా, పవన్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో పర్యటించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆసుపత్రిని పవన్ సందర్శించారు. గత యేడాది జరిగిన సాధారణ ఎన్నికల తరవాత పవన్ పొలిటికల్ పర్యటన చేపట్టలేదు. కాకపోతే.. పవన్ పొలిటికల్ టూర్ చేయనున్నాడనే సంకేతాలను మాత్రం ఇచ్చేశారు. అయితే, గ్రేటర్ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. పవన్ మళ్లీ పాలిటిక్స్ పై దృష్టి కేందికరించినట్లు కనిపిస్తోంది. తాజా శ్రీకాకుళం పర్యటనతో.. పవన్ పొలిటికల్ టూర్ షురు అయినట్లేనని.. ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పుకొంటున్నారు. మరీ.. పవన్ పొలిటికల్ టూర్ ని కంటిన్యూ చేస్తాడా.. ? లేదా..? శ్రీకాకుళం పర్యటన తర్వాత కాస్త విరామం తీసుకోనున్నాడా..? అన్నది వేచి చూడాలి.