భీమ్లా ఫై ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

పవన్ కళ్యాణ్ ఫై మరోసారి జగన్ కక్ష్య తీర్చుకున్నారు. రాజకీయంగా అడ్డు వస్తున్నాడని, జగన్ పవన్ కళ్యాణ్ సినిమాల ఫై కక్ష్య సాధిస్తున్నారు. వకీల్ సాబ్ విషయంలో ఎలాగైతే ఇబ్బందులు పెట్టాడో…భీమ్లా నాయక్ విషయంలోనూ అంతే ఇబ్బంది పెట్టాడు. కానీ జగన్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన అభిమానులు మాత్రం అవేమి పట్టించుకోలేదు. వారి ఉత్సహాన్ని రెట్టింపు చేసారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలువురు స్పందించగా..తాజాగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా జగన్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

‘సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు?ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’ అంటూ ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive 🙏🏻🙏🏻🙏🏻#JustAsking pic.twitter.com/eZxpVYYZbI— Prakash Raj (@prakashraaj) February 27, 2022