వైసీపీని ఐస్క్రీమ్ తో పోల్చారు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. నేతలంగా ఆ పార్టీని వీడిపోతున్నారని.. చివరకు ఆ పార్టీ ఐస్క్రీమ్ లా కరిగిపోవడం మినహా మరేమీ మిగలదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్రెడ్డి సెంటిమెంటు తప్ప వైకాపాకు ఎలాంటి ఆకర్షణ లేదన్న రఘువీర.. తమ పార్టీలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కావాలని ఆశించిన నేతల్లో జగన్ ప్రథముడని, జగన్ కు అధికార కాంక్ష తప్పితే మరోటి లేదని విమర్షించారు.