ఏపీ మంత్రి రావెల కిషోర్బాబు కుమారుడు సుశీల్ నిర్భయ కేసు నుండి బయటపడ్డాడు..రోడ్ ఫై నడుచుకుంటూ వెళ్ళుతున్న మహిళా ను వేధించాడంటూ సుశీల్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు..ఈ క్రమం లో బెయిల్పై బయటకు వచ్చిన సుశీల్… తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు రావెల సుశీల్ ఎవరో తనకు తెలియదని ఫిర్యాదుదారు కోర్టులో అఫిడవిడ్ దాఖలు చేయడం, కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.