తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక సైబరాబాద్ సీపీగా 2013 మార్చి 18న బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు…. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్నలను అందుకున్నారు. ఇక రెండేళ్ల కిందట జరిగిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.