అర్ధరాత్రి మహిళలకు ప్రత్యేక రవాణా సదుపాయం !


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని ఓ మహిళ, మంత్రి కేటీర్ కు ట్వీట్ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ, మహిళలకు రాత్రి సమయంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ల నుండి పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఆటోలు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్ కు సూచించారు. దీనిపై డీజీపీ అంజనీకుమార్ స్పందిస్తూ మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.