రాష్ట్రపతితో షిండే భేటి!

shindeరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోం మంత్రి షిండే సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. అందుతున్న విజ్ఞప్తులు, నివేదికల గురించి షిండే రాష్ట్రపతికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. విభజన విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని షిండే రాష్ట్రపతికి వివరిస్తున్నట్లు సమాచారం. విభజనపై రాష్ట్రపతి గతంలో పలు సూచనలు చేసిన నేపథ్యంలో.. వీరి భేటి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.