రాష్ట్ర ప్రజలు అనిశ్చితిలో వున్నారు : సీఎం

kiranరాష్ట్రప్రజలు అనిశ్చితిలో వున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఎల్బీస్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు మళ్లీ జరుగుతాయో.. ? లేదో.. ? అన్నఅనుమానాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఈ పండుగ ప్రతి ఏటా జరగాలని తెలుగు తల్లిని కోరుకుంటున్నానని చెప్పారు. చాలా క్లుప్తంగా ప్రసంగించిన సీఎం మరోసారి ఇందిరా గాంధీ నామజపం చేశారు. విశాలాంధ్రపై స్వర్గీయ ఇందిరాగాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంలో, తాను గట్టి సమైక్యవాదినని ఇందిర చెప్పారని అన్నారు. వందేళ్ల భవిష్యత్తును ఇందిర ముందే ఊహించారు కాబట్టే… ఈ వ్యాఖ్యలు చేయగలిగారని చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి.. ఒక పక్క దిక్కార స్వరం వినిపిస్తూనే మరో పక్క తెలంగాణ అనివార్యం అన్నభావానికి వస్తున్నట్లుగా ఉంది. కాగా, తెలంగాణ మంత్రులు ఈ ఉత్సవాలను బహిష్కరించారు.