టాస్క్ ముగిసింది… !

VijayKumarవిభజన తర్వాత కూడా రెండు ప్రాంతాల్లో శాంతిభద్రతలు సమర్ధవంతంగా ఉండేలా అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ టాస్క్ ఫోర్స్ బృందం సారధి విజయకుమార్ తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ చాలా సమర్ధంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో తమ పర్యటన ముగిసింది. ఇక ఢిల్లీ బయల్దేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. బలగాల పంపకాలు, వ్యవస్థ బలోపేతంపై నివేదికలు అందాయని విజయ్ కుమార్ తెలిపారు.