2014 టీడీపీదే : ఎన్టీఆర్

Jr.Ntrఎన్టీఆర్ 17వ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఎన్టీఆర్ ఘాటులో నివాళులర్పించారు. అనంతరం జూ. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కానీ అవసరాన్ని బట్టి పార్టీ ఎలక్షన్ కాంపైయిన్ లో పాల్గొంటానని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న “వస్తున్నా..మీకోసం” పాదయాత్ర వల్ల పార్టీకి బలం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబు పాదయాత్ర పొడిగించాలన్న ఆలోచన మంచిదే అని చెప్పారు.

పాదయాత్రలో పాల్గొనాలని వున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున వీలుకావడంలేదని, త్వరలో వీలుచేసుకొని పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. ప్రస్తుతం బాబు పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతుండగా, అనంతరం కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అయితే నందమూరి-టీడీపీకి పట్టున్న కృష్ణా జిల్లాలో ఏదో ఒక చోట బాబు పాదయాత్రలో జూనీయర్ ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.