తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య రాజీనామా

RAJAIAH_Rajinamaతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుండి ఉప ముఖ్యమంత్రి రాజయ్య రాజీనామా ను గవర్నర్ నరసింహన్ ఆమోదం చేసారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించి, ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. మంత్రివర్గంలో వివిధ మార్పుచేర్పులు కూడా చకచకా చేసేశారు. కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు.. ఆయనకు విద్యాశాఖను అప్పగించారు. ఇన్నాళ్లూ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు.