తెలంగాణ గురుకుల్ ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల

ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓపెన్ స్కూల్ విద్యా సంస్థల్లో 5 వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు గాను జూలై 18వ తేదీన గురుకుల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగింది.ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు విడుదల చేశారు. ప్రవేశపరీక్షకు 74వేల 75 మంది విద్యార్థులు హాజరు కాగా,46వేల 491మందికి సీట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.ఆ యా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు 50%శాతానికి పైగా స్థానికంగానే సీట్లివ్వడం జరిగిందన్నారు.సీట్లు పొందిన బాలబాలికలకు మంత్రి ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని అన్నారు.