ఒక్క సీసా అమ్మకుండా రూ.2,639 కోట్లు సంపాదించిన తెలంగాణ ఎక్సైజ్


తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఒక్క మద్యం బాటిల్ కూడా విక్రయించకుండా రూ.2,639 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తు రుసుం ద్వారా ఈ డబ్బును వసూలు చేసింది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాల కేటాయింపు కోసం దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద రూ.2 లక్షలు వసూలు చేసింది.