తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత డీకే అరుణ తన ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడీ విషయంలో అరుణ పై టీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి ప్రారంభించారు. అరుణ చేస్తున్నవన్నీ నాటకాలేనని, ఆమెకు దమ్ముంటే రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి కాకుండా శాసనసభ స్పీకర్కు పంపించాలని సవాల్ చేస్తున్నారు. తెలంగాణలో వ్యక్తుల కోసం జిల్లాలు ఏర్పాటు కావడం లేదని, పాలనా సౌలభ్యం కోసమే అనే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
ఆమె రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే రాజీనామా అంటున్నారని , ఆనాడు తెలంగాణ కోసం ఆమె రాజీనామా చేయలేదని, ఇప్పుడు గద్వాలను జిల్లా చేయాలి అంటూ రాజీనామా ప్రకటన చేయడంలో ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. మరి దీనిపై అరుణ ఎలాంటి సమాధనం ఇస్తారో చూడాలి.