తెలంగాణ లో కొత్తగా 5926 కరోనా కేసులు, 18 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5926 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,61,359 కేసులు నమోదు కాగా, ఇందులో 3,16,650 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 42,853 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 18 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1856 కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 2209 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 793 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 488, రంగారెడ్డి లో 455 , నిజామాబాదు లో 444 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.