కేసీఆర్ సవాల్ కు సై అన్న ఉత్తమ్

kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్ కు సిద్దమని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చలకైనా సిద్ధమని ఆయన చెప్పారు. కెసిఅర నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం తగదని, తెలంగాణ ప్రాజెక్టు వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మహారాష్ట్రతో ఒప్పందంలో రహస్యాలను బయటపెడతామన్న ఉత్తమ్ .. రాష్ట్ర భవిష్యత్తును మహారాష్ట్రకు తాకట్టుపెట్టి వచ్చారని ఆరోపించారు.

ఏమన్నా అంటే అవాకులు చవాకులు పేలి, టాపిక్ సైడ్ ట్రాక్ పట్టిస్తారని మండిపడ్డ ఉత్తమ్.. కేసీఆర్ భాష తమకు కూడా మాట్లాడడం వచ్చని, అలా మాట్లాడడం సరికాదని, తాను దేశానికి సేవ చేసే ఆర్మీ నుంచి వచ్చానని, ఇలాంటి చిల్లర భాష మాట్లాడే వ్యక్తిని కాదని , రాజకీయాలంటే తిట్టుకోవడం మాత్రమే కాదని…ప్రజలకు నిజంగా సేవ చేయాలని సూచన చేశారు.

ఈ రోజు కేసిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను సన్నాసులు అని సంబధించిన సంగతి తెలిసిందే.