కేసీఆర్ చెల్లెలుకి కాంగ్రెస్ పగ్గాలు.. ?

kcr-viyashanthiఒకప్పుడు కేసీఆర్ చెల్లెలుగా ఓ వెలుగు వెలిగింది రాములమ్మ (విజయశాంతి). ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా ఆమె స్థానం కేసీఆర్ ప్రక్కన. పిలుపు కేసీఆర్ చెల్లెలు. కొన్నాళ్లపాటు లోక్ సభలోనూ వీరిద్దరే కలసి తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే కొద్ది దినాల ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గట్టేక్కించేందుకు.. కేసీఆర్ చెల్లెలునే రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయినట్టు సమాచారమ్. రాములమ్మకి టీ-కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఓ ప్రకటన రావొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు పరిస్థితులో ఇంకెవ్వరికి ఇచ్చినా.. ఒకరిపై మరోకరు తిట్లదండకానికి దిగి.. ఆఖరికి కారుక్కెస్తారని.. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెల్లులే.. కేసీఆర్ కి చక్కటి పోటీ అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. రాములమ్మ మునిగిపోయిన టీ-కాంగ్రెస్ నావని ఒడ్డుకు ఎలా చేర్చుతుందో చూడాలి.