వివేకానంద రెడ్డి ..కేసులో సంచలన నిజాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విషయంలో సంచలన నిజాలు తెరపైకి వస్తున్నాయి. వైఎస్ వివేకాది సుపారి హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో అనుమానాలు మరింత పెరిగాయి. 800మంది అనుమానితులను విచారించిన తరువాత సునీల్ గ్యాంగ్ కిరాతకం వెలుగుచూసింది. నిందితులు వాడిన బైక్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు.

వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా.. ఆయన మరణంతో అనుమానాలు పెరిగాయి. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేయగా.. మరికొన్ని నిజాలు బయటపడ్డాయి. కాగా ఈ ఏడాది మార్చిలో వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని భావించినప్పటికీ.. ఒంటిపై ఉన్న గాయాలు, పోస్ట్ మార్టం నివేదికలో ఆయనది హత్య అని నిర్ధారణ అయ్యింది.