బాబు టి-బిల్లును సమర్దిస్తారు.. !

Errabelliతెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు సంచలన ప్రకటన చేశారు. తమ అధినేత చంద్రబాబు సైతం టీ-బిల్లును అసెంబ్లీలో సమరిస్తారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అంతేకాక, త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం శాఖ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. పార్టీ అనుమతి తీసుకోకుండా విభజనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం కేవలం విపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికేనని ఆయన అన్నారు. విభజనకు అనుకూలంగా తాము పార్టీని ఒప్పించామని, అందువల్ల అఖిలపక్షానికి తమ పార్టీ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. పయ్యావులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే డిమాండ్ ను ప్రక్కన పెడితే.. టీ-బిల్లును బాబు సమరిస్తారని దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై తెదేపా అధినేత ఎలా స్పందిస్తారో మరి.