టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ప్రొడ్యూసర్ గా ఎంతో గుర్తింపు ఉన్న అల్లు అరవింద్ తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలు మార్కెట్ లో ఓ రేంజ్ లో లాభాలు గడిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ భారతీయ డిజిటల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి.
ఈ నేపథ్యంలో అరవింద్ కూడా సొంతం గా ‘ఆహా’ పేరిట డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ చేయగా..తాజాగా ఈ ఆహా లో డైరెక్టర్ వేణు పాలుపంచుకోబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకత్వం వహించకుండా.. కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే స్వీకరించబోతున్నాడని తెలుస్తుంది.