ఇండియా లో చైనా సంస్థల మొబైల్స్ హల్చల్ చేస్తున్నాయి. అతి తక్కువ ధరలకే అత్యధిక ఫీచర్లు కలిగిన ఫాంలేయాను అందజేస్తుండడంతో వినియోగదారులు పోటీపడుతున్నారు. తాజాగా రియల్మి నుండి బడ్జెట్ ధరలో సరికొత్త కొత్త స్మార్ట్ఫోన్ను ఆన్లైన్ ద్వారా భారత్లో రిలీజ్ చేసింది. రియల్మి C11 పేరుతో వచ్చిన ఈ ఫోన్ లో సీ11 రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉండడం విశేషం.
పవర్ బ్యాంక్ తరహాలోనే ఇతర డివైజ్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) డ్యూయల్ కెమెరాలు ఫోన్లోని ప్రత్యేకత. రియల్మి C11 కేవలం 2 GB ర్యామ్+ 32 GB స్టోరేజ్ వేరియంట్లోనే విడుదలైంది. భారత్లో 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. జూలై 22 నుంచి ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, రియల్మి డాట్కామ్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.