ముంబై లో చరణ్ చేస్తున్న పని అదే

గత కొద్దీ రోజులుగా రామ్ చరణ్ ముంబై లో చక్కర్లు కొడుతున్నాడు. ఈయన తో పాటు చెల్లెలు శ్రీజ కూడా అక్కడే ఉంది. అయితే వీరిద్దరూ ముంబై లో ఏంచేస్తున్నారా…? అని అంత మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఆర్ఆర్ఆర్ కోసం ముంబై లో ఉన్నాడేమో అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.

చరణ్ తన వ్యాపారాలను అదే పాన్ ఇండియా స్థాయిలో విస్తరించాలని భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో తన వ్యాపారాలను బాగా విస్తరించాలని ప్లాన్ చేసుకుంటున్నారట. చరణ్ 2013వ సంవత్సరంలో ఓ ఎయిర్ లైన్స్ కంపెనీని మొదలుపెట్టారు. దీన్ని మెల్లగా విస్తరించే పనిలో ఉన్నారట. ఇక ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా ముంబైలో కనిపిస్తూ ఉండటంతో అందరిలోనూ ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. చరణ్ తరచుగా ముంబై వెళ్ళేది.. ఈ వ్యాపార పనుల కోసమే అని టాక్ వినిపిస్తోంది.