అమెజాన్ లో మరో సేల్

ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరిట సరికొత్త ఆఫర్స్ ఇచ్చిన అమెజాన్..మరో సేల్ ను ప్రవేశపెట్టింది. దీపావళి సందర్భాంగా ‘సెలబ్రేషన్ స్పెషల్’ పేరుతో అక్టోబర్ 13 నుండి 17న వరకు ఈ సేల్ ను మొదలుపెట్టబోతుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అక్టోబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది.

ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్, ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ లాంటి ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. రూ.32,999 విలువైన వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ రూ.29,999 ధరకే కొనొచ్చు. రెడ్‌మీ 7ఏ, సాంసంగ్ గెలాక్సీ ఎం30 మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.