మీరు ఏది కొనాలన్నా ఫ్లిప్ కార్ట్ లో తీసుకోండి..ఎందుకంటే..

ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్..మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్‌’ పేరిట ఆరు రోజుల పాటు భారీ సేల్ ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు ఈ డిస్కౌంట్ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో రూ.49 నుంచే ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి.

ఏ ఏ వాటికీ ఆఫర్స్ అంటే..టీవీలు, గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, బొమ్మలు, స్మార్ట్ పరికరాలు, కిరాణా సామాన్లు. ఇంకా టెక్ ప్రియుల కోసం మొబైల్స్, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్, వాటికి సంబంధించిన పరికరాలు ఈ సేల్‌లో ఉంటాయి. దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, ఇంటి అలంకరణ ఉత్పత్తులపై అదనంగా 20 శాతం తగ్గింపు.. ప్రతి గంటకు ఒక కొత్త డీల్, ఒక ప్లాష్ సేల్ ఉంది. అర్థరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో అదనపు డిస్కౌంట్లు ఉంటాయి. గృహసంబంధిత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది.