‘రియల్‌మి ఎక్స్‌టీ’ ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతం ఇండియా లో చైనా సంస్థల మొబైల్స్ హల్చల్ చేస్తున్నాయి. అతి తక్కువ ధరలకే అత్యధిక ఫీచర్లు కలిగిన ఫాంలేయాను అందజేస్తుండడంతో వినియోగదారులు పోటీపడుతున్నారు. తాజాగా రియల్‌మి నుండి ‘ఎక్స్‌టీ’ సిరీస్‌ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ సిరీస్‌లో 64 మెగాపిక్సెల్‌ (ఎంపీ) క్వాడ్‌–కెమెరా సిస్టమ్‌ ఉన్నట్లు సంస్థ ప్రకటించగా, భారత్‌లోనే ఈస్థాయి కెమెరా సామర్థ్యాన్ని కలిగిన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ ప్రత్యేకతలు చూస్తే..

* సెల్ఫీ కెమెరా 16 ఎంపీ
* 6.4–అంగుళాల పూర్తి హెచ్‌డి సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే..

మొత్తం మూడు వేరియంట్లలో ఎక్స్‌టీ లభిస్తుండగా.. 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ. 15,999.. 6జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ. 16,999 వద్ద నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది.