ప్రస్తుతం ఇండియా లో చైనా సంస్థల మొబైల్స్ హల్చల్ చేస్తున్నాయి. అతి తక్కువ ధరలకే అత్యధిక ఫీచర్లు కలిగిన ఫాంలేయాను అందజేస్తుండడంతో వినియోగదారులు పోటీపడుతున్నారు. తాజాగా రియల్మి నుండి ‘ఎక్స్టీ’ సిరీస్ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ సిరీస్లో 64 మెగాపిక్సెల్ (ఎంపీ) క్వాడ్–కెమెరా సిస్టమ్ ఉన్నట్లు సంస్థ ప్రకటించగా, భారత్లోనే ఈస్థాయి కెమెరా సామర్థ్యాన్ని కలిగిన స్మార్ట్ఫోన్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ ప్రత్యేకతలు చూస్తే..
* సెల్ఫీ కెమెరా 16 ఎంపీ
* 6.4–అంగుళాల పూర్తి హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే..
మొత్తం మూడు వేరియంట్లలో ఎక్స్టీ లభిస్తుండగా.. 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 15,999.. 6జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 16,999 వద్ద నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది.