రెడ్మీ నోట్ 7 ప్రో… ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ట్రెండ్ లో వున్న స్మార్ట్ఫోన్. ఇప్పుడు పండగ సందర్భంగా కొనుగోలుదారులను ఆకట్టుకోవడం కోసం అత్యుత్తమ ఆఫర్ను ప్రకటించింది . తమ ఫోన్లలో అత్యంత అధికంగా అమ్ముడుపోయే రెడ్మీ నోట్ 7 ప్రో ధరను శాశ్వతంగా రూ.2000 తగ్గించింది.
తాజా ధరలతో ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్ వెబ్సైట్లలో ఈ ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. రూ.13,999గా ఉన్న 4జీబీ/64జీబీ వేరియంట్ ధర తగ్గింపు అనంతరం రూ.11,999కు లభ్యం కానుంది.రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసినప్పుడు 4జీబీ+64జీబీ ధర రూ.13,999 కాగా 6జీబీ+64 జీబీ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.16,999.